16, ఏప్రిల్ 2023, ఆదివారం

భారతదేశానికి ఆ పేరు ఎలా వచ్చింది

 భరతునికి ముందు ఈ దేశం పేరు అజనాభం.


దీన్ని పరిపాలించిన రాజులలో 

నాభి ఒకడు.


నాభికి నారాయణుడు కొడుకుగా పుట్టాడు.


ఆతడే ఋషభుడు. 


నాభి తర్వాత రాజైన 

ఋషభునికి నూర్గురు కొడుకులు.


వారిలో పెద్దవాడు భరతుడు.

ఋషభుడు భరతునికి పట్టం కట్టాడు.


భరతుని వల్ల అజనాభం

మహాభారతమనే పేరు గలదయింది.


భారతవర్షమని పేరు పొందిన భూమండలంలోని అయా భూభాగాలకు తన కొడుకులలో కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు,  ఆర్యావర్తుడు, మలయకేతువు,  భద్రసేనుడు, ఇంద్రస్పృక్కు, విదర్భుడు, కీకటుడు అనే తొమ్మిదిమందిని ప్రధానులుగా నియమించాడు. 


వారి కప్పగించిన భూభాగాలు వారి పేళ్లతో ప్రసిద్ధి పొందాయి.


కవి మొదలైన మరో తొమ్మిది మంది భాగవతధర్మాన్ని ప్రకాశింపజేశారు.


మిగిలిన ఎనుబదియొక్కమంది వేదధర్మాన్ని అనుష్ఠిస్తూ, బ్రాహ్మణోత్తములుగా పేరుపొందారు.


కామెంట్‌లు లేవు: