ఎఱ్ఱన "చతురోక్తిపదంబుల" అని తన కావ్యలక్షణంగా చెప్పుకొన్నదాన్నే శ్రీనాధుడు సూక్తివైచిత్రి అన్నాడు.
ఇక్కడ సూక్తి అంటే మనం చెప్పుకొనే సూక్తులు అన్న అర్థం కాదు. అంటే ఒక నీతినో ధర్మాన్నో లేక న్యాయాన్నో సూత్రప్రాయంగా చెప్పబడేవి సూక్తులు. ఇక్కడ ఆ అర్థం కాదని భావం.
కవిత్వంలో సూక్తి పదానికి ఎన్నో అర్థాలున్నాయి. సుష్ఠు ఉక్తం సూక్తం మనోజ్ఞంగా చెప్పబడిన మాట సూక్తి. రుచిరమై చమత్కార యుక్తమైన కూర్పు కూడా సూక్తే. అర్థబోధనకు తోడ్పడి సంభాషణకి పుష్టి చేకూర్చేవి సూక్తులు.
చతురోక్తులని పిండితార్థం.
నన్నెచోడుని చతురోక్తుల అన్న ప్రయోగాన్నే ఎఱ్ఱన అలాగే స్వీకరించాడు.
(నన్నెచోడుడే నిజమైన ప్రబంధపరమేశ్వరుడనే వాదం ఉంది)
శ్రీనాథుడన్న సూక్తి వైచిత్రికి
"భావనాశక్తిచేత మనోహరంగా మధురచతురోక్తులతో లోకోత్తరచమత్కారాన్ని సాధించి, మనోవికాసాన్ని కల్గించడం" అన్నది అర్థమని ఎఱ్ఱన కవిత్వం ఆధారంగా చెప్పవచ్చు.
ఎఱ్ఱన చతురోక్తులనే జక్కన్న శబ్ద వైచిత్రి అని,
చింతలపూడి ఎల్లనార్యుడు "......మృదుమధురవచస్సంపద అని ఎఱ్ఱన పట్ల గౌరవాన్ని ప్రకటించారు.
ఎఱ్ఱన ఉక్తి వైచిత్రిని శ్రీనాథుడు అనుకరించడం విశేషం.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి