ఇతి కృత్వా మతిం సాధ్వీం ఈవిధంగా సముద్రుడు,
సముద్రశ్ఛన్నమంభసి | సాధుమతితో (మంచి మనస్సుతో) ఆలోచించి,
హిరణ్యనాభం మైనాక తనలో (నీటిలో) దాగి ఉన్న
మువాచ గిరిసత్తమమ్ || 91 || మైనాకునితో ఇలా అన్నాడు.
త్వమిహాసురసంఘానాం "ఓ మైనాకా!* ఇంద్రుని కారణంగా*
పాతాళతలవాసినాం | పాతాళ*వాసులైన రక్కసిమూకలకు
దేవరాజ్ఞా గిరిశ్రేష్ఠ అడ్డుగా
పరిఘ స్సన్నివేశితః || 92 || పరిఘ (గడియమ్రాను,పెనుశిల) లా నిలిచావు.
త్వమేషాం జాతవీర్యాణాం వారు తిరిగి లేచి రాకుండా,
పునరేవోత్పతిష్యతాం | పాతాళద్వారాన్ని పూర్తిగా మూసేశావు.
పాతళస్యాప్రమేయస్య
ద్వారమావృత్య తిష్ఠసి || 93 ||
తిర్యగూర్ధ్వమధశ్చైవ పైకి క్రిందకి అన్నివైపులకూ
శక్తిస్తే శైల వర్ధితుం | పెరిగే సామర్థ్యం కలవాడవు.
తస్మా త్సంచోదయామి త్వా కాబట్టి లే.
ముత్తిష్ఠ గిరిసత్తమ || 94 ||
స ఏష కపిశార్దూలః హనుమంతుడు,
త్వాముపర్యేతి వీర్యవాన్ | రామకార్యార్థమై
హనూమాన్ రామకార్యార్థం ఇదిగో, వస్తున్నాడు.
భీమకర్మా ఖమాప్లుతః || 95 ||
అస్య సాహ్యం మయా కార్య ఇక్ష్వాకులు* నాకు పూజ్యులు.
మిక్ష్వాకుకులవర్తినః | (నన్ను ఆశ్రయించి ఉన్నందున) నీకు మిక్కిలి పూజ్యులు.
మమ హీక్ష్వాకవః పూజ్యాః అందువల్ల ఇక్ష్వాకువంశజుడైన రాముని సచివునికి
పరం పూజ్యతమాస్తవ || 96 || సహాయపడడం మన కర్తవ్యం.
కురు సాచివ్య మస్మాకం కాబట్టి మాకు సహాయపడు.
న నః కార్యమతిక్రమేత్ | మా పనిని విధిగా ఆచరించు.
కర్తవ్య మకృతం కార్యం సకాలంలో కర్తవ్యాన్ని (చేయవలసినది) చేయకపోతే
సతాం మన్యుముదీరయేత్ || 97 || పెద్దలకు (ఇంద్రాది దేవతలకు) కోపం వస్తుంది.
సలిలాదూర్ధ్వముత్తిష్ఠ ఈ కపివరుడు మనకు అతిథి. పూజ్యుడు.
తిష్ఠత్వేష కపి స్త్వయి | పైకి రా.
అస్మాకమతిథిశ్చైవ నీపై అతడు విశ్రాంతి తీసుకొంటాడు.
పూజ్యశ్చ ప్లవతాం వరః || 98 ||
చామీకరమహానాభ విశ్రాంతి తర్వాత ప్రయాణాన్ని కొనసాగిస్తాడు.
దేవగంధర్వసేవిత | ఇదిగో, రానే వచ్చాడు.
హనుమాంస్త్వయి విశ్రాంతః
తత శ్శేషం గమిష్యతి || 99 ||
(స ఏష కపిశార్దూలః
త్వాముపర్యేతి వీర్యవాన్)
కాకుత్థ్సస్యానృశంస్యం చ కాకుత్థ్సుని* (రాముని) మంచితనాన్ని,
మైథిల్యాశ్చ వివాసనం | మైథిలి* దుఃస్థితిని,
శ్రమం చ ప్లవగేంద్రస్య హనుమంతుని శ్రమను గుర్తించి,
సమీక్ష్యోత్థాతుమర్హసి || 100 || బయటకు రా!"
హిరణ్యనాభో మైనాకో మైనాకుడు,
నిశమ్య లవణాంభసః | సముద్రుని మాటలను విని,
ఉత్పపాత జలాత్తూర్ణం లతలతో కూడిన మహావృక్షాలతో సహా
మహాద్రుమలతాయుతః || 101 || వేగంగా
స సాగరజలం భిత్త్వా మేఘపటలాన్ని చీల్చుకొని,
బభూవాభ్యుత్థిత స్తదా | ప్రకాశించే కిరణాలతో వచ్చే దివాకరునిలా,
యథా జలధరం భిత్త్వా సాగరజలాన్ని భేదించుకొని,
దీప్తరశ్మిర్దివాకరః || 102 || బయటకు వచ్చాడు.
స మహాత్మా ముహూర్తేన సముద్రజలాలచేత ఆవృతుడై,
పర్వతస్సలిలావృతః | ఒక్కసారిగా తటాలున
దర్శయామాస శృంగాణి తన శృంగాలను దర్శింపజేశాడు.
సాగరేణ నియోజితః || 103 ||
శాతకుంభమయైః శృంగైః కిన్నరులను, మహాసర్పాలను కలిగిన మైనాకునిశిఖరాలు
సకిన్నరమహోరగైః | బంగరుకాంతులను ప్రసరిస్తున్నాయి.
ఆదిత్యోదయసంకాశైః అవి, ఆకాశాన ఆలిఖిస్తూ,
ఆలిఖద్భిరివాంబరమ్ || 104 || ఉదయిస్తున్న సూర్యకిరణాల్లా భాసిస్తున్నాయి.
తప్తజాంబూనదైః శృంగైః సముద్రజలాలనుండి ఉవ్వెత్తుగా పైకి లేచిన
పర్వతస్య సముత్థితైః | ఆ శిఖరాల పుటంపెట్టిన బంగారుకాంతులతో
ఆకాశం శస్త్రసంకాశ లోహవర్ణంగల ఆకాశం
మభవత్కాంచనప్రభమ్ || 105 || కాంచనప్రభలను పొందింది.
జాతరూపమయైః శృంగైః స్వర్ణమయములై, స్వయంప్రభలతో వెలిగే శిఖరాలతో
భ్రాజమానైస్స్వయంప్రభైః | ఆ మైనాకుడు
ఆదిత్యశతసంకాశః నూఱుగురు సూర్యుల్లా ప్రకాశించాడు.
సో౭భవ ద్గిరిసత్తమః || 106 ||
తముత్థితమసంగేన అకారణంగా సముద్రం మధ్యనుంచి లేచి,
హనూమానగ్రతః స్థితం | ఎదురుగా నిలిచిన మైనాకపర్వతాన్ని చూచి,
మధ్యే లవణతోయస్య హనుమంతుడు,
విఘ్నో౭యమితి నిశ్చితః || 107 || "ఇదొక ఆటంకం" అనుకొన్నాడు.
స తముచ్ఛ్రితమత్యర్థం మేఘాన్ని వాయువులా,
మహావేగో మహాకపిః | ఉన్నతమైన ఆ పర్వతాన్ని
ఉరసా పాతమాయాస తన వక్షఃస్థలంతో పడద్రోశాడు.
జీమూతమివ మారుతః || 108 ||
స తథా పాతితస్తేన తనను పడద్రోసిన
కపినా పర్వతోత్తమః | ఆయన వేగాన్ని తెలుసుకుని,
బుద్ధ్వా తస్య కపేర్వేగం మైనాకుడు, ఆనందంతో పులకించాడు.
జహర్ష చ ననంద చ || 109 ||
తమాకాశగతం వీర ప్రేమతో, ప్రసన్నమైనమదితో
మాకాశే సముపస్థితః | మానవరూపం ధరించి,
ప్రీతో హృష్టమనా వాక్య తన శిఖరం పైన నిలిచి,
మబ్రవీత్పర్వతః కపిం | హనుమంతునితో ఇలా అన్నాడు.
మానుషం ధారయన్ రూప
మాత్మనశ్శిఖరే స్థితః || 110 ||
-----------------------------------------------------------------------------------------------------
* మైనాకుడు - మేనకా హిమవంతుల కుమారుడు.
పర్వతరూపుడు.
ఇంద్రుడు పర్వతాల ఱెక్కలను విఱిచేటప్పుడు, ఇతడు భయపడి, దక్షిణసముద్రంలో దాగాడు.
* ఒకసారి బలి, ఇంద్రుని జయించి, స్వర్గాన్ని ఆక్రమించుకొన్నాడు.
అప్పుడు విష్ణువు వామనుడై బలిని పాతాళానికి పంపాడు.
అతనితో రాక్షసులు పాతాళానికి చేరారు.
సముద్రంలోనే పాతాళద్వారం ఉంది.
వారు తిరిగి రాకుండా ఇంద్రుడు,
సముద్రంలోనే ఉన్న మైనాకుని ఆ ద్వారానికి అడ్డుగా ఉండమన్నాడు.
* పాతాళం - అధోలోకం.
బలినివాసం.
పాపాలు చేస్తే దీంట్లో పడతారు.
ముల్లోకాల్లో ఒకటి.
స్వర్గలోకం, మర్త్యలోకం (భూలోకం), పాతాళం అనేవి ముల్లోకాలు.
* ఇక్ష్వాకులు - ఇక్ష్వాకువంశపు రాజులు.
ఇక్ష్వాకువు గుఱించి మునుపు చెప్పడం జరిగింది.
* కాకుత్థ్సుడు - కకుత్థ్సునివంశానికి చెందినవాడు.
కకుత్థ్సుడు సూర్యవంశపు రాజు.
వికుక్షి కుమారుడు.
అసలు పేరు పురంజయుడు.
ఈయనకు కకుత్థ్సుడనే పేరు రావడం వెనుక ఒక కథ ఉంది.
రాక్షసబాధను సహించలేక దేవతలు బ్రహ్మకు, విష్ణువుకు చెప్పుకొన్నారు.
వారు పురంజయుని ఆశ్రయించమన్నారు.
అపుడు దేవతలు పురంజయుని వేడగా, ఆయన ఎద్దుపైకి ఎక్కి వస్తానన్నాడు.
అంత ఇంద్రుడు వృషభమయ్యాడు.
పురంజయుడు కకుత్ పై కూర్చొని, రాక్షసులతో యుద్ధం చేసి, ఓడించి, తఱిమాడు.
కకుత్ అంటే ఎద్దుమూపురం. దానిపై స్థ అంటే ఉన్నవాడు కాబట్టి కకుత్థ్సుడనే పేరు వచ్చింది.
ఇంద్రవాహనుడనే పేరు కూడా వచ్చింది.
కకుత్థ్సునివంశంవారు కాకుత్థ్సులు.
* మైథిలి - సీత.
నిమిని మథించగా జనకుడు పుట్టాడు.
అందువల్ల జనకుని మిథి అన్నారు.
మిథి పాలించిన దేశమే మిథిల.
మిథిలరాజకుమార్తె కాన సీత మైథిలి అయ్యింది.
------------------------------------------------------------------------------------------------------
జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితం |
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః || 6 ||
వైశాఖ బహుళ దశమి - హనుమజ్జయంతి శుభాకాంక్షలు.
శుభం భూయాత్
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి